Share News

Vishnu Kumar Raju: వైసీపీకి ఇదే చివరి విజయ దశమి పండగ

ABN , First Publish Date - 2023-10-23T13:56:45+05:30 IST

ఇది వైసీపీ రౌడీ వెధవలు చేసిన పనే.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. బట్టలు ఊడదీసి... బూతులు తిట్టారు.. ఇది ఏమైనా మీ ప్రత్యేక రాజ్యమని అనుకుంటున్నారా?

Vishnu Kumar Raju: వైసీపీకి ఇదే చివరి విజయ దశమి పండగ

విశాఖ: పుంగనూరులో సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలుపై జరిగిన దాడిని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు (Vishnu Kumar Raju) తీవ్రంగా ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది వైసీపీ రౌడీ వెధవలు చేసిన పనే.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. బట్టలు ఊడదీసి... బూతులు తిట్టారు.. ఇది ఏమైనా మీ ప్రత్యేక రాజ్యమని అనుకుంటున్నారా?, ఉత్తరాంధ్రవాసులు శాంతియుతంగా యాత్ర చేస్తే అవమాన పరుస్తారా?, రౌడీ మూకలు.. సీఎం జగన్ (Cm jagan), మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితులు. ఇటువంటి దుర్మార్గ చర్యలను పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాలి. మానవ హక్కులు కమిషన్ కూడా సుమోటోగా తీసుకోవాలి. ఉత్తరాంధ్ర మనోభావాల్ని దెబ్బతీశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి (YCP) డిపాజిట్స్ రావు. వైసీపీకి ఇదే చివరి విజయ దశమి పండగ.’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-10-23T13:56:45+05:30 IST