AP News: అనకాపల్లి జిల్లాలో దారుణం...

ABN , First Publish Date - 2023-02-23T11:28:29+05:30 IST

అనకాపల్లి జిల్లా: మాకవరపాలెం మండలం, లచ్చన్నపాలెంలో దారుణం జరిగింది. గ్రామ వాలంటీర్ (Village Volunteer) కొండబాబు ముగ్గురు యువకులపై కత్తి (Knife)తో దాడి చేశాడు.

AP News: అనకాపల్లి జిల్లాలో దారుణం...

అనకాపల్లి జిల్లా: మాకవరపాలెం మండలం, లచ్చన్నపాలెంలో దారుణం జరిగింది. గ్రామ వాలంటీర్ (Village Volunteer) కొండబాబు ముగ్గురు యువకులపై కత్తి (Knife)తో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. లచ్చన్నపాలెంకు చెందిన కొండబాబు గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తూ.. మాంసం దుకాణం నిర్వహిస్తున్నాడు. అదే గ్రాయానికి చెందిన ముగ్గురు యువకులు బైక్‌పై వెళుతున్న సమయంలో కుక్కలు వెంటపడ్డాయి.

మాంసం దుకాణం కారణంగా కుక్కలు వస్తున్నాయని పేర్కొంటూ యువకులు కొండబాబుతో వాగ్వాదానికి దిగారు. దీంతో వారి మధ్య మాటా.. మాటా పెరిగి.. ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొండబాబు చేతిలో ఉన్న మాంసం కత్తితో యువకులపై దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన నిన్న జరిగింది.

Updated Date - 2023-02-23T11:28:32+05:30 IST