Panchumarti Anuradha: బడుగు, బలహీన వర్గాలంటే నీకెందుకంత చులకన జగన్ రెడ్డీ?

ABN , First Publish Date - 2023-07-07T15:05:56+05:30 IST

ధర్మవరం పద్మశాలి చేనేత వస్త్ర వ్యాపారులపై వైసీపీ నేత అవినాష్ దాడి ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ స్పందించారు.

Panchumarti Anuradha: బడుగు, బలహీన వర్గాలంటే నీకెందుకంత చులకన జగన్ రెడ్డీ?

అమరావతి: ధర్మవరం పద్మశాలి చేనేత వస్త్ర వ్యాపారులపై వైసీపీ నేత అవినాష్ దాడి ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (TDP MLC Panchumarthi Anuradha) స్పందించారు. బడుగు, బలహీన వర్గాలంటే నీకెందుకంత చులకన జగన్ రెడ్డీ (AP CM YS Jaganmohan Reddy) అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... బాకీ తీర్చమన్న చేనేత వ్యాపారిని బట్టలూడదీసి కొట్టడం జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనమన్నారు. జగన్ రెడ్డి అండ చూసుకునే అవినాష్ గుప్తా వంటి రౌడీ మూక పేట్రేగుతున్నారని మండిపడ్డారు. సరఫరా చేసిన సరుక్కి డబ్బు అడగటమే చేనేత వ్యాపారి శశి చేసిన నేరమా అని ప్రశ్నించారు. రుణమాఫీ, సబ్సిడీ లోన్స్ సహా పలు సంక్షేమ కార్యక్రమాలతో చంద్రన్న చేనేతలను ఆదుకుంటే జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారని విమర్శించారు. నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వ విధానాలతో చేనేత రంగం కుదేలైందన్నారు. అవమానభారంతో శశి కుటుంబం ఏమైనా చేసుకుంటే ఎవరిది బాధ్యత అని నిలదీశారు. అవినాష్ గుప్తాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి చేనేత వర్గం తగిన బుద్ధి చెప్పడం ఖాయమని పంచుమర్తి అనురాధ హెచ్చరించారు.

Updated Date - 2023-07-07T15:05:56+05:30 IST