TDP MLAs: తుళ్లూరు పోలీసు స్టేషన్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2023-03-20T20:02:20+05:30 IST

అసెంబ్లీలో తమపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని తుళ్లూరు పోలీసు స్టేషన్‌ (Tullur police station)లో టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) ఫిర్యాదు చేశారు.

TDP MLAs: తుళ్లూరు పోలీసు స్టేషన్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు

అమరావతి: అసెంబ్లీలో తమపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని తుళ్లూరు పోలీసు స్టేషన్‌ (Tullur police station)లో టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, వెల్లంపల్లి, ఎలిజా, కారుమూరుపై టీడీపీ ఎమ్మెల్యేలు స్వామి, బుచ్చయ్య చౌదరి ఫిర్యాదు చేశారని టీడీపీ నేతలు చెప్పారు. అసెంబ్లీలో జరిగిన ఘటనపై విచారణ జరపాలని, ఎడిట్‌ చేయని ఫుటేజీని పరిశీలించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పోలీసులకు తెలిపారు.

టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామిపై ( TDP MLA Dola Veeranjaneya Swamy) దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేలను (YCP MLAs) సభలో అడుగు పెట్టనివ్వమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జరిగిన ఘటన ఆగ్రహం తెప్పిస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం సందర్భంలోనూ సభలో ఎమ్మెల్యేలను కొట్టలేదని చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీ చరిత్రలో ఇది ఓ చీకటి రోజు అని, అసెంబ్లీలో దాడి ఘటనలు గతంలో జరగలేదని, స్వామిపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. టీడీపీనే దాడి చేసిందని అరోపిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద మనిషి బుచ్చయ్యచౌదరి మీదకు వస్తారా..? అని, స్వామి మీద చేయి వేయకుండా చూసుకోలేకపోయామనే బాధ తనకెప్పుడూ ఉంటుందని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2023-03-20T20:08:33+05:30 IST