Share News

Lokesh YuvaGalam: గెయిల్ బాధితుల ఆవేదనపై లోకేష్ స్పందన

ABN , First Publish Date - 2023-11-27T16:03:47+05:30 IST

YuvaGalam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పి.గన్నవరం నియోజకవర్గం నగరం గ్రామానికి చెందిన ఓఎన్జీసీ – గెయిల్ బాధితులు లోకేష్‌ను వినతిపత్రం అందజేశారు. 2014 జూన్ 27న తమ గ్రామంలోని ఓఎన్జీసీ - గెయిల్ పైపులైన్ల బ్లాస్టింగ్ జరిగిందని.. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోయారని.. అనేకమంది క్షతగాత్రులయ్యారని తెలిపారు.

Lokesh YuvaGalam: గెయిల్ బాధితుల ఆవేదనపై లోకేష్ స్పందన

అంబేద్కర్ కోనసీమ జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పి.గన్నవరం నియోజకవర్గం నగరం గ్రామానికి చెందిన ఓఎన్జీసీ – గెయిల్ బాధితులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 2014 జూన్ 27న తమ గ్రామంలోని ఓఎన్జీసీ - గెయిల్ పైపులైన్ల బ్లాస్టింగ్ జరిగిందని.. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోయారని.. అనేక మంది క్షతగాత్రులయ్యారని తెలిపారు. నష్టపోయిన వారికి అప్పటి టీడీపీ ప్రభుత్వ చొరవతో ఒక్కొక్కరికి రూ.25 లక్షలు పరిహారం అందించిందని తెలిపారు. గెయిల్ యాజమాన్యం బాధితులు, గ్రామస్తులకు అప్పట్లో ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదని గెయిల్ బాధితులు తెలిపారు.


గెయిల్ బాధితులు ఆవేదనపై లోకేష్ స్పందిస్తూ.. ప్రమాదం జరిగిన పదేళ్లు కావస్తున్నా ఓఎన్జీసీ – గెయిల్ అధికారులు ఇప్పటివరకు బాధితులను ఆదుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రాంత ప్రజలు వ్యక్తిగతంగా తమకు కష్టనష్టాలు ఉన్నప్పటికీ దేశాభివృద్ధి దష్ట్యా ఓఎన్జీసీ - గెయిల్ సంస్థలకు తమవంతు సహకారం అందిస్తూ వస్తున్నారన్నారు. ప్రమాదం సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవాల్సిన పూర్తి బాధ్యత చమురు సంస్థలదే అని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పేలుడులో ధ్వంసమైన దేవాలయాలు, ముస్లిం పంజాల స్థానంలో కొత్తవి నిర్మిస్తామన్నారు. ఓఎన్జీసీ - గెయిల్ అధికారులతో మాట్లాడి బాధితులు, నగరం గ్రామస్థులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-27T16:03:48+05:30 IST