Share News

YuvaGalam: లోకేష్‌ను కలిసిన వీసీఐసీ కారిడార్ భూ నిర్వాసితులు

ABN , First Publish Date - 2023-12-12T15:00:58+05:30 IST

Andhrapradesh: జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్‌న వీసీఐసీ కారిడార్ భూ నిర్వాసితులు కలిశారు.

YuvaGalam: లోకేష్‌ను కలిసిన వీసీఐసీ కారిడార్ భూ నిర్వాసితులు

అనకాపల్లి: జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam Padayatra) కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్‌న వీసీఐసీ కారిడార్ భూ నిర్వాసితులు కలిశారు. 2016లో టీడీపీ ప్రభుత్వం తమ భూములకు అవార్డు ప్రకటించిందని తెలిపారు. నేటికీ భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోలేదని భూ నిర్వాసితులు అన్నారు.


దీనిపై నారా లోకేష్ మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులు పూర్తిచేయడంపై లేదని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి ఉపకరించే ప్రాజెక్టులకు భూసేకరణ చేసినపుడు చట్టప్రకారం పరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామని యువనేత హామీ ఇచ్చారు.

Updated Date - 2023-12-12T15:00:59+05:30 IST