Kesineni Chinni: యువగళం పాదయాత్ర గమ్యం చేరే వరకు ఆగదు

ABN , First Publish Date - 2023-09-26T14:20:50+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణిని టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్ధ వెంకన్న, నాగులు మీరా మంగళవారం కలిశారు.

Kesineni Chinni: యువగళం పాదయాత్ర గమ్యం చేరే వరకు ఆగదు

రాజమహేంద్రవరం: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari), కోడలు బ్రాహ్మిణిని (Brahmini) టీడీపీ నేతలు కేశినేని చిన్ని (Kesineni Chinni), బుద్ధ వెంకన్న(Budda Venkanna), నాగులు మీరా (Nagul Meera) మంగళవారం కలిశారు. అనంతరం కేశినేని చిన్ని మాట్లాడుతూ... సీఎం జగన్ ఒక నియంత.. ఒక సైకో అని అన్నారు. త్వరలోనే చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని తెలిపారు. యువగళం పాదయాత్ర గమ్యం చేరేవరకు ఆగదన్నారు. 400 రోజులు 4000 వేల కిలోమీటర్లు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించాలని చూసినా తమకు ప్రత్యామ్నాయం ఉందన్నారు. సీఎం జగన్‌కు అంటిన బురద అందరికి అంటించాలని చూస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ను పులివెందుల్లో ఓడించడమే లక్ష్యమన్నారు. ఐదు నెలల్లో జగన్ ప్రభుత్వం కులబోతుందని కేశినేని చిన్ని పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T14:20:50+05:30 IST