Share News

RK Roja:జగనే మళ్లీ సీఎం కావాలి.. దుర్గమ్మ సన్నిధిలో రోజా కామెంట్స్

ABN , First Publish Date - 2023-10-15T11:45:48+05:30 IST

విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రి దుర్గమ్మ(Indrakeeladri) తల్లిని మంత్రి ఆర్ కే రోజా ఆదివారం దర్శించుకున్నారు. దసరా(Dussera) శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ఆమె అమ్మవారి ఆశీస్సులకోసం వచ్చారు.

RK Roja:జగనే మళ్లీ సీఎం కావాలి.. దుర్గమ్మ సన్నిధిలో రోజా కామెంట్స్

విజయవాడ: విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రి దుర్గమ్మ(Indrakeeladri) తల్లిని మంత్రి ఆర్ కే రోజా ఆదివారం దర్శించుకున్నారు. దసరా(Dussera) శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ఆమె అమ్మవారి ఆశీస్సులకోసం వచ్చారు. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగనే సీఎం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.


అమ్మ ఆశీర్వాదంతోనే 2019 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్సీపీ(YSRCP) గెలించిందని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న సీఎం జగన్(CM Jagan)కు దుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు ఎన్నటికీ ఉండాలని ఆకాంక్షించారు. రానున్న ఎన్నికల్లో జగన్ శత్రువులను జయించి పేద ప్రజల సేవ కోసం మళ్లీ అధికారం చేపట్టాలని అన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

Updated Date - 2023-10-15T11:49:44+05:30 IST