Prathipati Pulla Rao : టీడీపీ నాటిన మొక్కను అని చెప్పిన ఆమెకు ఛాలెంజ్‌లు విసిరే అర్హత లేదు..

ABN , First Publish Date - 2023-07-03T12:57:43+05:30 IST

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అంటే డాక్టర్‌ని నియమిస్తారని.. కానీ తమ మంత్రి విడదల రజనీకి కనీస అవగాహన కూడా లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పోస్టింగ్ దగ్గర నుంచి అన్ని పనుల్లో అవినీతి చేశారన్నారు. ఆరోగ్యశ్రీ ఎన్ని ఆసుపత్రిలకు ఇస్తున్నారని ప్రశ్నించారు

Prathipati Pulla Rao :  టీడీపీ నాటిన మొక్కను అని చెప్పిన ఆమెకు ఛాలెంజ్‌లు విసిరే అర్హత లేదు..

గుంటూరు : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అంటే డాక్టర్‌ని నియమిస్తారని.. కానీ తమ మంత్రి విడదల రజనీకి కనీస అవగాహన కూడా లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పోస్టింగ్ దగ్గర నుంచి అన్ని పనుల్లో అవినీతి చేశారన్నారు. ఆరోగ్యశ్రీ ఎన్ని ఆసుపత్రిలకు ఇస్తున్నారని ప్రశ్నించారు. స్టెంట్‌కి ఎలాంటి పరికరాలు ఉపయోగిస్తున్నారని అడిగారు. టీడీపీ నాటిన మొక్కను అని చెప్పి చంద్రబాబు, లోకేష్‌లకు ఛాలెంజ్ విసిరే అర్హత రజనీకి లేదని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

ఈ రోజు ఫ్యామిలి డాక్టర్ పెట్టారని.. అది అసలు జరుగుతుందా? అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ లో రూపాయి డబ్బులు కూడా లేవన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత ఇచ్చామో చూడండని అన్నారు. మీరు కేవలం సోషల్ మీడియాలో ఆర్భాటాలు కోసమే మాట్లాడుతున్నారని విమర్శించారు. చిలకలూరిపేటలో ఆసుపత్రి కూడా కట్టలేని ఘనత మంత్రి విడదల రజినీదని ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-07-03T12:57:43+05:30 IST