MLC Elections: ఉమ్మడి పశ్చిమలో 98.46 శాతం పోలింగ్‌

ABN , First Publish Date - 2023-03-13T19:27:36+05:30 IST

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) స్థానిక సంస్థల నుంచి రెండు ఎమ్మెల్సీ పదవులకు సోమవారం పోలింగ్‌ జరిగింది. మొత్తం 1105 మంది ఓటర్లకు

MLC Elections: ఉమ్మడి పశ్చిమలో 98.46 శాతం పోలింగ్‌

ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) స్థానిక సంస్థల నుంచి రెండు ఎమ్మెల్సీ పదవులకు సోమవారం పోలింగ్‌ జరిగింది. మొత్తం 1105 మంది ఓటర్లకు గాను 1088 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొవ్వూరు, ఏలూరు, జంగారెడ్డిగూడెం (Eluru Jangareddygudem), నరసాపురం, భీమవరం కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు పోలింగ్‌ కొనసాగింది. తొలుత మందకొడిగా ఆరంభమై చివరకు నాలుగు గంటలకు పోలింగ్‌ పరిసమాప్తి నాటికి 98.46 శాతం మేర ఓటింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పోలింగ్‌ (Polling)కు ముందురోజు ఆదివారం రాత్రి వైసీపీ ఓటర్లకు నగదు, సెల్‌ఫోన్‌లు, వెండి గ్లాసులు ఎక్కడికక్కడ పంపిణీకి తెగబడింది. మంత్రులు కొట్టు సత్యనారాయణ భీమవరంలోను, హోం మంత్రి తానేటి వనిత కొవ్వూరులోను, మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నరసాపురంలోను తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి, జడ్పీ చైర్మన్‌ కౌరు శ్రీనివాస్‌ నరసాపురంలోనే ఓటు వేశారు. నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghu Rama Krishna Raju)తోపాటు ఎమ్మెల్సీలు షేక్‌ సాబ్జీ, మంతెన సత్యనారాయణరాజు వంటి వారితో సహా 17 మంది ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు.ఎటువంటి వివాదం లేకుండా పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది.

Updated Date - 2023-03-13T19:27:36+05:30 IST