12వ రోజు ముగిసిన పాదయాత్ర.. 146 కి.మీ నడిచిన లోకేష్

ABN , First Publish Date - 2023-02-07T22:47:06+05:30 IST

టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Lokesh) యువగళం పాదయాత్ర 12వ రోజు ముగిసింది.

12వ రోజు ముగిసిన పాదయాత్ర.. 146 కి.మీ నడిచిన లోకేష్

చిత్తూరు: టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Lokesh) యువగళం పాదయాత్ర 12వ రోజు ముగిసింది. బుధవారం ఉదయం 8 గంటలకు దిగువమాసపల్లి నుంచి లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra) ప్రారంభం కానుంది. ఉదయం 9.45 గంటలకు అయ్యనవేడు గ్రామస్తులతో లోకేష్ సమావేశం అవుతారు. ఉదయం 11.45 గంటలకు అరదలలో యువతీయువకులతో లోకేష్ మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అరదలలో లోకేష్‌ భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు అరదలలో రైతులతో లోకేష్ భేటీ కానున్నారు. 2 గంటలకు అరదల నుంచి పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 5:30 గంటలకు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర ప్రవేశించనుంది. ముత్యాలమ్మతల్లి గుడి ప్రాంగణంలో లోకేష్ రాత్రి బస చేయనున్నారు. ఇప్పటివరకు యువగళం యాత్రలో నారా లోకేష్ 146 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్రలో భాగంగా ఇవాళ నారా లోకేష్ చిత్తూరు సిటీ వీధుల్లో పర్యటించారు.

అభిమానులు, కార్యకర్తలు యువనేత నారా లోకేష్‌కు పూల వర్షంతో స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయవ్యవస్థపై కక్షగట్టిందని లోకేష్ విమర్శించారు. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చి అధికారంలో వచ్చాక సీఎం జగన్ మోసం చేశారని, ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నారని లోకేష్ విమర్శించారు.

Updated Date - 2023-02-07T22:47:37+05:30 IST