Share News

AP News: నెల్లూరు జిల్లాలో కారు బీభత్సం.. ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2023-11-24T17:40:15+05:30 IST

కావలి మండలం చెన్నాయపాళెం క్రాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

AP News: నెల్లూరు జిల్లాలో కారు బీభత్సం.. ముగ్గురి మృతి

నెల్లూరు: కావలి మండలం చెన్నాయపాళెం క్రాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మహిళను ఢీకొట్టి ఆ వెంటనే కంటైనర్‌ లారీని ఢీకొట్టి స్విప్ట్ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో మహిళతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాల పాలైన మరో ఇద్దరిని నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను అతికష్టం మీద పోలీసులు బయటకు తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2023-11-24T17:40:16+05:30 IST