Somu Veerraju: ఏపీలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై చార్జ్ షీట్..

ABN , First Publish Date - 2023-05-22T16:54:08+05:30 IST

నెల్లూరు జిల్లా: ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.

Somu Veerraju: ఏపీలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై చార్జ్ షీట్..

నెల్లూరు జిల్లా: ఏపీ (AP) వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు (BJP Executive Meetings) నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) స్పష్టం చేశారు. సోమవారం నెల్లూరు జిల్లా, కావలిలో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కర్నూలులో బీసీ (BC) సామాజిక చైతన్య సభని త్వరలో నిర్వహిస్తామన్నారు. ఏపీలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై చార్జ్ షీట్ వేస్తామన్నారు. కావలిలో సీఎం జగన్ (CM Jagan) పర్యటనలో డీఎస్పీ (DSP) వెంకటరమణ బీజేపీ నేతల పట్ల వ్యవహారించిన తీరుపై రాష్ట్ర గవర్నర్, డీజీపీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి (Pratap Kumar Reddy) అవినీతిపై చార్జ్ షీట్ వేస్తామని, ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వం చేసే వ్యతిరేక విధానాలు, నిధుల దుర్వినియోగంపై ఛార్జ్ షీట్‌లు వేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

Updated Date - 2023-05-22T16:54:08+05:30 IST