Home » Kavali
ఎన్నికల విధుల కోసం ఊరుగాని ఊరొచ్చిన తల్లీకొడుకును రైలు రూపంలో వచ్చిన మృత్యువు పొట్టనపెట్టుకుంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రైల్వేస్టేషన్లో ఆదివారం ఉదయం పట్టాలు దాటుతున్న తల్లీకొడుకును రైలు వేగంగా ఢీకొనడంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు
నెల్లూరు జిల్లా: కావలి రూరల్ మండలం, ముసునూరు టోల్ ప్లాజా దగ్గర బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయి. వెనుక నుంచి కారు ఢీ కొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వాలంటీర్లతో రహస్యంగా భేటీ అయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కావలి శివారులో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డికి చెందిన స్కూల్ అందుకు వేదిక అయింది. సీఎం జగన్ భోజన విరామ సమయంలో వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా పని చేయాలంటూ ఈ సందర్భంగా వాలంటీర్లకు ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
Andhrapradesh: కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుల ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఎమ్మెల్యే అనుచరులం అన్న అహకారంతో వారు పెట్రేగిపోతున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా వికృతచేష్టలకు పాల్పడుతున్నారు.
నెల్లూరు జిల్లా: కావలిలో ఆర్టీసీ డ్రైవర్పై హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్, అతని అనుచరులను పట్టుకోలేకపోతున్నారు. సుధీర్ ఇంటి వద్దకు వెళ్లి, ఇంట్లోకి వెళ్లలేక డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, సుమారు 30 మంది పీసీలు వెనుదిరిగారు.
నెల్లూరు జిల్లా: కావలిలో దారుణం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. రౌడీమూఖలు పెట్రేగిపోతున్నాయి. బైకు అడ్డంగా ఉండగా హారన్ మోగించారని ఆర్టీసీ డ్రైవర్లపై మూకుమ్మడిగా దాడి చేసి, హత్యాయత్నం చేశారు.
కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డిపై అధికారులకు స్వామిభక్తి రోజు రోజుకు పెరుగుతోంది.
నెల్లూరు జిల్లా: కావలిలో టీడీపీ నేత కావ్య కృష్ణా రెడ్డి ‘బాబుతో నేను’ అనే పోస్టర్లను భారీగా వేయించారు. దీంతో వెంటనే ఆ పోస్టర్లను తొలగించాలని స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) అక్రమ అరెస్టును నిరశిస్తూ టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో కావలిలో రెండు వేల మంది కార్యకర్తలతో నిరసన ర్యాలీ చేపట్టారు.
నెల్లూరు జిల్లా: కావలిలో దారుణం జరిగింది. వైసీపీ నేతల గ్రావెల్ మాఫియా దందాతో జలదంకి నరశింహారావు(35) మృతి చెందాడు. రుద్రకోట నుంచి చెన్నాయపాళెంకి గ్రావెల్ తరలిస్తున్నారు.