Home » Kavali
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలి పర్యటనలో ఒక అరుదైన, ఆత్మీయ ఘట్టం చోటుచేసుకుంది. మంగళవారం కావలిలో సీఎం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన పర్యటనలో ప్రోటోకాల్ ఆడంబరాలకు దూరంగా ఒక సాధారణ జాలరి కుటుంబంతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు.
ధూప, దీప, నైవేద్యాల కోసం 73 దేవస్థానాలకి నెలకి రూ.10వేలు చొప్పున సహాయం అందిస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. దాతలు దేవస్థానాలు నిర్మించేటప్పుడు దేవాదాయ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆదేశించారు.
కొన్ని రోజుల క్రితం కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి తనను హత్య చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతోనే తన హత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా పోలీసులు ఈ కేసులో A5 గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని చేర్చారు.
తనను హత్య చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్లాన్ చేశారని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి ఆరోపించారు. క్రషర్ వద్ద మధ్యాహ్న సమయాల్లో తాను ఉంటుంటానని చెప్పుకొచ్చారు. ఇవాళ వేరే పనిమీద విజయవాడకి వచ్చానని పేర్కొన్నారు.
YSRCP Leader Attacks: కావలిలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా దాడులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. చెంచుగానిపాలెం గ్రామంలో మాజీ ఏఎంసీ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ నివాసానికి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వచ్చాడు.
Kavali CI Overaction: జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి... కొంత మందితో కలిసి వెళ్లి కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం పైలాన్ను విధ్వంసం చేశారు. ఈ కేసులో రామిరెడ్డి ఏ8 నిందితుడిగా ఉన్నారు.
Pawan on Pahalgam Attack: ఏ ధర్మాన్ని ఆచరిస్తారని తెలుసుకుని హతమార్చారంటే ఎంతటి దారుణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఏం జరిగిందో వారు చెబుతుంటే తనకే పేగులు మెలబెట్టినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న మధుసూధనరావు.. తల్లిదండ్రులు, అత్తమామల కోసం ఆ ఉద్యోగాన్ని వదిలి ఇండియాకి వచ్చారు. కొన్నేళ్లుగా బెంగుళూరులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.
Pawan Kalyan: సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్టుపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టుపై కావలి రెండో పట్టణం పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
YSRCP: నెల్లూరులో వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి తీరుపై మత్స్యకార నేతలు తిరుబాట వేశారు. ఈ విషయంలో వైసీపీ హే కమాండ్తో తాడో పేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు.