Share News

Nellore: సోమిరెడ్డి పోరాటానికి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి సంఘీభావం..

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:20 AM

నెల్లూరు: జిల్లాలో అధికారపార్టీ నేతలు చేస్తున్న అక్రమ మైన్స్ దోపిడీపై సోమిరెడ్డి పోరాటానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంగీబావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ సహజ వనరులను అధికార వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని...

Nellore: సోమిరెడ్డి పోరాటానికి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి సంఘీభావం..

నెల్లూరు: జిల్లాలో అధికారపార్టీ నేతలు చేస్తున్న అక్రమ మైన్స్ దోపిడీపై టీడీపీ నేత సోమిరెడ్డి పోరాటానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంగీబావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ సహజ వనరులను అధికార వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని, ఇక రెండు నెలలు మాత్రమే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. ఎన్నికల తరువాత భవిష్యత్‌లో కూడా వైసీపీ అధికారాన్ని చూడలేదన్నారు. నెల్లూరు జిల్లాలో సిలిక, ఇసుక, క్వాడ్జి ఇష్టనుసారంగా దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ధ్వంసం అవుతున్న గ్రామాల్లోని రోడ్లుపై నీలదీసిన ప్రజలకు ఇది జగన్మోహన్ రెడ్ది వ్యాపారం అని చెప్పి బెదిరిస్తున్నారు.. మంత్రి కాకాణి సొంత గ్రామానికి సమీపంలో జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. అధికారులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు

Updated Date - Dec 17 , 2023 | 11:20 AM