Nellore: ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2023-07-30T11:10:54+05:30 IST

నెల్లూరు జిల్లా: కావలి-బిట్రగుంట రైల్వే స్టేషన్ల మధ్య నర్సాపూరం-ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. ఎగువ మార్గంపై ముసునూరు సమీపంలో రెండు మీటర్ల పొడవుండే పట్టా ముక్కను గుర్తు తెలియని దుండగులు రైలు పట్టాలపై అడ్డుగా పెట్టారు.

Nellore: ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం

నెల్లూరు జిల్లా: కావలి-బిట్రగుంట రైల్వే స్టేషన్ల మధ్య నర్సాపూరం-ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. ఎగువ మార్గంపై ముసునూరు సమీపంలో రెండు మీటర్ల పొడవుండే పట్టా ముక్కను గుర్తు తెలియని దుండగులు రైలు పట్టాలపై అడ్డుగా పెట్టారు. అది గమనించిన లోకో పైలెట్ అప్రమత్తమై.. వెంటనే రైలు వేగాన్ని నియంత్రించారు. తక్కువ వేగంలో వస్తున్న రైలు పట్టా ముక్కను ఢీ కొట్టింది. దీంతో పట్టాముక్క దూరంగా పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు ఇనుము దొంగలు, మద్యం మత్తులో ఆకతాయిలు, సంఘ విద్రోహ శక్తులపనై ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీఆర్పీఎఫ్ అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-07-30T11:10:54+05:30 IST