భూముల రీసర్వేపై జేసీ తనిఖీ

ABN , First Publish Date - 2023-04-18T22:57:23+05:30 IST

మండలంలో జరుగుతున్న భూముల రీసర్వేను మంగళవారం జాయింట్‌ కలెక్టరు కూర్మనాథ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వల్లూరు, మల్లూరు గ్రామాల్లో జరుగుతున్న భూముల రీసర్వే పనులను పరిశీలించారు.

భూముల రీసర్వేపై జేసీ తనిఖీ
సర్వే రాళ్లను పరిశీలిస్తున్న జేసీ కూర్మనాధ్‌

ముత్తుకూరు, ఏప్రిల్‌ 18: మండలంలో జరుగుతున్న భూముల రీసర్వేను మంగళవారం జాయింట్‌ కలెక్టరు కూర్మనాథ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వల్లూరు, మల్లూరు గ్రామాల్లో జరుగుతున్న భూముల రీసర్వే పనులను పరిశీలించారు. గ్రామ సర్వేయర్ల ఆధ్వర్యంలో నాటుతున్న సర్వే రాళ్ల ప్లాంటేషన్‌ పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని తనిఖీ చేశారు. ‘జగనన్న భూరక్ష పథకం’ కింద జరుగుతున్న భూముల రీసర్వే విషయంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా చూసుకోవాలని సూచించారు. శాశ్వత భూహక్కు, భూరక్షలో భాగంగా రీసర్వే నిర్వహించి, అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామన్నారు. భవిష్యత్తులో రైతులకు భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా సర్వే శాఖ ఉన్నతాధికారులు, తహసీల్దారు సురేష్‌బాబు, మండల సర్వేయరు కామేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-18T22:57:54+05:30 IST