AP News: ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2023-05-27T17:39:48+05:30 IST

జిల్లాలో కావలి మండలం గౌరవరం వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.

AP News: ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

నెల్లూరు: జిల్లాలో కావలి మండలం గౌరవరం వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కలకత్తా- చెన్నై జాతీయరహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుక‌ నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మాలకొండ నుంచి నెల్లూరుకి వెళుతుండగా ఘటన చోటుచేసుకుంది. మృతులు నెల్లూరుకి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరపుతున్నారు.

Updated Date - 2023-05-27T17:39:48+05:30 IST