Share News

నేటి నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. షెడ్యూల్ వివరాలివే..

ABN , First Publish Date - 2023-11-27T08:22:32+05:30 IST

నేటి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పున: ప్రారంభం కానుంది. నేటి ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి ఉదయం 10.19 గంటలకు లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకూ 209 రోజుల పాటు 2852.4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

నేటి నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. షెడ్యూల్ వివరాలివే..

అంబేద్కర్ కోనసీమ : నేటి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పున: ప్రారంభం కానుంది. నేటి ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి ఉదయం 10.19 గంటలకు లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకూ 209 రోజుల పాటు 2852.4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

210 వ రోజుకు సంబంధించిన వివరాలు..

10.19 గంటలకు రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం

11.20 గంటలకు తాటిపాక సెంటర్‌లోని బహిరంగసభలో లోకేష్ ప్రసంగం

12.35 గంటలకు పి.గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశం నగరంలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో ముఖాముఖి

మధ్యాహ్నం 2 గంటలకు మామిడికుదురులో స్థానికులతో సమావేశం

2.45 గంటలకు పాశర్లపూడిలో భోజన విరామం

సాయంత్రం 4 గంటలకు పాశర్లపూడి నుంచి పాదయాత్ర కొనసాగింపు

4.30 గంటలకు అప్పనపల్లి సెంటర్‌లో స్థానికులతో సమావేశం

5.30 గంటలకు అమలాపురం నియోజకవర్గంలో ప్రవేశం, స్థానికులతో మాటామంతీ

6.30 గంటలకు బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి

7.30 గంటలకు పేరూరులో రజక సామాజికవర్గీయులతో భేటి

7.45 గంటలకు పేరూరు శివారు విడిది కేంద్రంలో బస

Updated Date - 2023-11-27T08:22:34+05:30 IST