Share News

Nara Lokesh : ఓటమి భయంతోనే వైసీపీ నేతల దాడులు..

ABN , First Publish Date - 2023-11-10T10:39:16+05:30 IST

వైసీపీ నేతలు ఓటమి భయంతో టీడీపీ నేతలపై దాడులకి తెగబడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. చంద్రగిరి మండలం భీమవరం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడుపై వైసీపీ నేత కొటాల చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు హత్యాయత్నం చేయడం దారుణమన్నారు.

Nara Lokesh : ఓటమి భయంతోనే వైసీపీ నేతల దాడులు..

అమరావతి : వైసీపీ నేతలు ఓటమి భయంతో టీడీపీ నేతలపై దాడులకి తెగబడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ వేదికగా తెలిపారు. చంద్రగిరి మండలం భీమవరం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడుపై వైసీపీ నేత కొటాల చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు హత్యాయత్నం చేయడం దారుణమన్నారు. మునిరత్నం నాయుడు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోందని నారా లోకేష్ అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని.. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని నారా లోకేష్ తెలిపారు.

Updated Date - 2023-11-10T10:42:02+05:30 IST