Minister Roja: ఆ స్థలాలను సమాధులతో పోల్చడమేంటి?.. చంద్రబాబుపై రోజా ఆగ్రహం

ABN , First Publish Date - 2023-05-19T14:43:31+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడపై పర్యాటక, క్రీడా,సాంస్కృతి శాఖ మంత్రి రోజా ఫైర్ అయ్యారు.

Minister Roja: ఆ స్థలాలను సమాధులతో పోల్చడమేంటి?.. చంద్రబాబుపై రోజా ఆగ్రహం

తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(TDP Chief Chandrababu Naidu)పై పర్యాటక, క్రీడా,సాంస్కృతి శాఖ మంత్రి రోజా (Tourism, Sports and Culture Minister Roja) ఫైర్ అయ్యారు. అమరావతి భూములను నిరుపేదలకు అందించడాన్ని చంద్రబాబు (TDP Chief) రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేదల జీవితాలు బాగుపడడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. నిరుపేదలకు ఇచ్చే స్థలాలను సమాధులతో పోల్చడమేంటని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో ఆ సమాధుల్లోనే టీడీపీని (TDP) ప్రజలు పూడ్చేస్తారని వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు తమనే అని ధీమా వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థను జనం మెచ్చుకుంటే చంద్రబాబు మాత్రమే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థలో సరికొత్త మార్పును తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే (AP CM YS Jaganmohan Reddy) దక్కుతుందని మంత్రి రోజా పేర్కొన్నారు.

Updated Date - 2023-05-19T14:43:31+05:30 IST