Minister Suresh: చంద్రబాబుపై పెట్టిన కేసులో రాజకీయ ప్రమేయం లేదు

ABN , First Publish Date - 2023-10-10T16:25:27+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై పెట్టిన కేసుల్లో రాజకీయ ప్రమేయం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

Minister Suresh: చంద్రబాబుపై పెట్టిన కేసులో రాజకీయ ప్రమేయం లేదు

ప్రకాశం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై (TDP Chief Chandrababu Naidu)పెట్టిన కేసుల్లో రాజకీయ ప్రమేయం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ (Minister Adimulapu Suresh) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై నమోదు అయిన కేసులలో పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తప్పు చేశారు కాబట్టే బెయిల్ రావటం లేదన్నారు. లోకేష్‌పై ఒక కేసు పెట్టేలోపే ఢిల్లికి పారిపోయారని వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వాళ్ళు చట్టం ముందు తప్పించకోలేరన్నారు. చట్టం అందరికీ సమానమే అని చెప్పుకొచ్చారు. అధికారం ఉన్నప్పుడు అడ్డంగా దొచుకున్నారు అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-10-10T16:25:27+05:30 IST