YCP: వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

ABN , First Publish Date - 2023-03-20T17:57:03+05:30 IST

ఢిల్లీ లిక్కర్ కేసులో ఒంగోలు వైసీపీ (YCP) ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి (Magunta Sreenivasulu Reddy) ఈడీ (ED) నోటీసులు జారీ చేసింది.

YCP: వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ కేసులో ఒంగోలు వైసీపీ (YCP) ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి (Magunta Sreenivasulu Reddy) ఈడీ (ED) నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఈడీ నోటీసులు పంపించింది. లిక్కర్ స్కామ్‌పై మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈనెల 18న ఈడీ విచారణకు ఎంపీ మాగుంట గైర్హాజరైయ్యారు.

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గైర్హాజరయ్యారు. సౌత్‌ గ్రూపులో కీలకంగా ఉన్న శ్రీనివాసులు రెడ్డిని శనివారం విచారణకు హాజరు కావాలని ఇటీవల ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, తన సోదరుని కుమారుడు అనారోగ్యంగా ఉన్న కారణంగా తాను చెన్నైలో ఉండిపోయానని, కాబట్టి విచారణకు రాలేకపోతున్నానని ఈడీకి ఆయన లేఖ రాశారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఈడీ అరెస్టు చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ్‌ మాగుంట జ్యుడీషియల్‌ రిమాండ్‌ను రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 28 వరకు పొడిగించింది. రిమాండ్‌ గడువు ముగియడంతో తిహాడ్‌ జైలులో ఉన్న ఆయనను శనివారం సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ ఎదుట ప్రవేశపెట్టారు. దర్యాప్తులో పురోగతి సాధించామని, మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని, కాబట్టి రాఘవ్‌ రిమాండ్‌ను పొడిగించాలని ఈడీ తరఫున న్యాయవాదులు అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి ఈ నెల 28 వరకు రిమాండ్‌ గడువును పొడిగించారు.

Updated Date - 2023-03-20T18:00:14+05:30 IST