Yuvagalam Padayatra: జగన్ దళిత ద్రోహి: లోకేశ్

ABN , First Publish Date - 2023-05-03T16:16:56+05:30 IST

సీఎం జగన్‌ (CM Jagan)పై టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ దళిత ద్రోహి అని దుయ్యబట్టారు.

Yuvagalam Padayatra: జగన్ దళిత ద్రోహి: లోకేశ్

కర్నూలు: సీఎం జగన్‌ (CM Jagan)పై టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ దళిత ద్రోహి అని దుయ్యబట్టారు. దళితులపై దమనకాండ జరుగుతోందని, దళితులను చంపడానికి స్పెషల్ లైసెన్స్ ఇచ్చారని ధ్వజమెత్తారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని విమర్శించారు. సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే విదేశీ విద్యా పథకం ప్రారంభిస్తామని, వైసీపీ నేతలు (YCP leaders) లాక్కున్న దళితుల భూములను తిరిగి ఇప్పిస్తామని ప్రకటించారు. దళితులకు భూమి కొని కేటాయిస్తామని నారా లోకేశ్ ప్రకటించారు.

Updated Date - 2023-05-03T16:16:56+05:30 IST