Lakshmi Parvathi : ఎన్టీఆర్ నా భర్త.. నాణెం విడుదలకు నన్నూ ఆహ్వానించండి

ABN , First Publish Date - 2023-08-25T13:56:48+05:30 IST

ఈ నెల 28న ఎన్టీఆర్ నాణెం విడుదలకు లక్ష్మీపార్వతికి ఆహ్వానం అందలేదు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లకు లక్ష్మీపార్వతి లేఖ రాశారు. ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించాలని లేఖలో లక్ష్మీపార్వతి కోరారు.

Lakshmi Parvathi : ఎన్టీఆర్ నా భర్త.. నాణెం విడుదలకు నన్నూ ఆహ్వానించండి

ఢిల్లీ : ఈ నెల 28న ఎన్టీఆర్ నాణెం విడుదలకు లక్ష్మీపార్వతికి ఆహ్వానం అందలేదు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లకు లక్ష్మీపార్వతి లేఖ రాశారు. ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించాలని లేఖలో లక్ష్మీపార్వతి కోరారు. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమ ఆహ్వానితుల జాబితాలో తన పేరునూ చేర్చాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ తన భర్త అని, తన భర్త పేరుపైన నాణెం విడుదల చేస్తూ తనకు ఆహ్వానం పంపకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

బహుశా అధికారుల తొందరపాటు కారణంగా ఈ తప్పు జరిగి ఉండవచ్చని, తప్పును వెంటనే సరిదిద్దాలని కూడా లక్ష్మీపార్వతి లేఖలో పేర్కొన్నారు. 28న ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని రూ.100 నాణేన్ని కేంద్రం విడుదల చేస్తోంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమం జరగనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం పంపింది. కార్యక్రమానికి చంద్రబాబు, పురందేశ్వరి, బాలకృష్ణలతో పాటు పలువురు కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.

Updated Date - 2023-08-25T13:56:48+05:30 IST