AP News: నంద్యాలలో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
ABN , First Publish Date - 2023-06-01T06:34:15+05:30 IST
జిల్లాలోని కొత్తపల్లి మండలం పాత బట్టువారి పల్లె సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది.
నంద్యాల: జిల్లాలోని కొత్తపల్లి మండలం పాత బట్టువారి పల్లె సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ శివారులో ఈశ్వర్ అనే యువకుడికి పులి తారపడింది. పులిని చూసిన యువకుడు భయాందోళనతో పరుగులు తీశాడు. పులి సంచారంపై గ్రామస్థులకు తెలియజేయగా.. వారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీ శాఖ అధికారులు ఘటానా స్థలికి చేరుకుని పులి అడుగుజాడలను పరిశీలిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. ప్రజలు ఎవరూ భయపడవద్దని అధికారులు సూచించారు. గ్రామ శివారులో పులి సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.