Share News

AP News: బస్టాండ్ వద్ద కొండచిలువ, రక్తపింజర్.. బెంబేలెత్తిన ప్రజలు

ABN , First Publish Date - 2023-11-22T16:02:24+05:30 IST

విజయవాడ రూరల్ గూడవల్లి గ్రామంలో కొండచిలువ, రక్తపింజర్, పాముల కలకలం రేగింది.

AP News: బస్టాండ్ వద్ద కొండచిలువ, రక్తపింజర్.. బెంబేలెత్తిన ప్రజలు

కృష్ణా జిల్లా: విజయవాడ రూరల్ గూడవల్లి గ్రామంలో కొండచిలువ, రక్తపింజర్, పాముల కలకలం రేగింది. రద్దీగా ఉండే గూడవల్లి బస్టాండ్ వద్ద కొండ చిలువ, రక్త పింజర్, రెండు చిన్న పాములు హల్‌చల్ చేశాయి. పాములను చూసిన గూడవల్లి గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే 100 కాల్ చేసి పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి పడమట పోలీసులు సమాచారం ఇచ్చారు. రంగంలో దిగిన ఫారెస్ట్ సిబ్బంది 7 అడుగుల కొండచిలువను, 5 అడుగుల రక్తపింజర్, రెండు చిన్న పాములను పట్టుకున్నారు. రంగురంగుల నాలుగు పాములను చూసి గూడవల్లి గ్రామస్తులు భయంతో బెంబేలెత్తిపోయారు. ఎంతో చాకచక్యంగా పాములను ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2023-11-22T16:05:34+05:30 IST