Anuradha: జగన్‌కు సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదు..

ABN , First Publish Date - 2023-05-19T15:25:48+05:30 IST

సీఎం జగన్‌ (CM Jagan)కు సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదని, ముఖ్యమంత్రి పేదల పెన్నిధి కాదు.. పేదల ద్రోహి అంటూ టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు.

Anuradha: జగన్‌కు సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదు..

విజయవాడ: సీఎం జగన్‌ (CM Jagan)కు సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదని, ముఖ్యమంత్రి పేదల పెన్నిధి కాదు.. పేదల ద్రోహి అంటూ టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (Panchumurti Anuradha) విమర్శించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ అన్న క్యాoటీన్ ద్వారా పేదల ఆకలి తీర్చిన చంద్రబాబు పేదల పెన్నిధి అని, అన్న క్యాoటీన్ రద్దు చేసి పేదల పొట్ట కొట్టిన జగన్ పేదల పెన్నిధి ఎలా అవుతారని ప్రశ్నించారు. చంద్రబాబు (Chandrababu) తెచ్చిన 100కుపైగా సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్‌కు పేదల పెన్నిధి అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? అన్నారు.

ఉచిత ఇసుక రద్దు చేసి ఇసుక దోపిడి చేస్తున్న సీఎం జగన్ దోపిడి దారుడు అవుతారు తప్ప పేదల పెన్నిధి ఎలా అవుతారని అనురాధ ప్రశ్నించారు. ఇసుక మాఫియాని ప్రశ్నించినందుకు దళిత యువకుడికి శిరోముండనం చేసిన జగన్ పేదల పెన్నిదా? అంటూ మండిపడ్డారు. టిడ్కో గృహాలు ఇవ్వకుండా పేదలను వేధించిన జగన్ పేదల పెన్నిధి ఎలా అవుతారు?... తాడేపల్లిలో తన ఇంటి దగ్గర ఉన్న పేదల ఇల్లు కూల్చేసిన జగన్ ఆర్ 5 జోన్‌లో ఇళ్ల స్థలాలు ఇస్తామనడం ఏంటంటూ నిలదీశారు. సీఎం బీసీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని, దళితుల అసైన్డ్ భూములు లాక్కున వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఎలా అవుతోందో జగన్ సమాధానం చెప్పాలన్నారు. నిజమైన పేదల పెన్నిధి చంద్రన్న... పేదల ద్రోహి జగన్ అంటూ అనురాధ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-05-19T15:25:48+05:30 IST