AP News: వాహనదారులకు గమనిక.. మున్నేరు బ్రిడ్జి మూసివేత
ABN , First Publish Date - 2023-07-29T16:25:55+05:30 IST
భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నదులు, కాలువలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టినా ప్రవాహం ఏ మాత్రం తగ్గలేదు. దీంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఎన్టీఆర్ జిల్లా: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నదులు, కాలువలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టినా ప్రవాహం ఏ మాత్రం తగ్గలేదు. దీంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు, మూడు రోజులుగా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ప్రవాహం తగ్గుతుందేమోనని ఆశించారు గానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పైగా భారీ వరదల కారణంగా మున్నేరు బ్రిడ్జి పూర్తిగా దెబ్బతింది. దీంతో వత్సవాయి మండలం పరిధిలోని లింగాల గ్రామం దగ్గర ఉన్న మున్నేరు బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. మరోవైపు వత్సవాయి-జగ్గయ్యపేట రూట్లో రాకపోకలు నిలిచిపోయాయి. వత్సవాయి మండలంలోకి వెళ్లేందుకు పెనుగంచిప్రోలు మండలం మీదగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.