Raja Singh: ఏపీలో ఈసారి చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది..

ABN , First Publish Date - 2023-04-29T17:35:46+05:30 IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) అన్నారు.

Raja Singh: ఏపీలో ఈసారి చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ తెలంగాణ (Telangana) అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు వల్లేనని అన్నారు. ఇక్కడ కేసీఆర్ (KCR) చేసేదేమీలేదన్నారు. అలాగే కాంగ్రెస్ (Congress) కూడా ఏమీ చేయలేదని విమర్శించారు.

చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని, తనకు రాజకీయ జీవితం ఇచ్చింది బాబేనని రాజాసింగ్ పేర్కొన్నారు. అయితే తానొక హిందూవాదినని, ధర్మం కోసం పనిచేస్తానని అన్నారు. తన మనస్థత్వానికి టీడీపీ కూడా మ్యాచ్ కాదని, తనకు మ్యాచ్ అయ్యే పార్టీ ఒక్క బీజేపీయేనని, తనకు టీడీపీలో చేరే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ఒకవేళ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా అయినా రాజాసింగ్‌ను గెలిపిస్తామని గోషామహల్ ప్రజలు అంటున్నారని.. ఎందుకంటే 24 గంటలు ప్రజల మధ్యనే ఉంటానని, ధర్మ రక్షణ, గోరక్షణ అన్నింటిలో తాను ముందుంటానని... అందుకే గోషామహల్ ప్రజలు తనను గౌరవిస్తారని రాజాసింగ్ స్పష్టం చేశారు. అయితే తన ఆలోచన ఏంటంటే.. బీజేపీ తనకు టిక్కెట్ ఇస్తేనే రాజకీయం గురించి ఆలోచిస్తానని, బండి సంజయ్ కోసం పనిచేస్తానని.. ఏది ఏమైనా అధిష్టానం నిర్ణయానికే వదిలేస్తున్నానని రాజాసింగ్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-29T19:58:25+05:30 IST