Janasena Leader: మా నాయకుడి గురించి మాట్లాడితే చెప్పు తెగుతుంది..

ABN , First Publish Date - 2023-10-02T11:19:13+05:30 IST

జనసేన సభ చూశాక వైసీపీ నాయకులకు పిచ్చి పట్టిందని ఆ పార్టీ గాదె వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.

Janasena Leader: మా నాయకుడి గురించి మాట్లాడితే చెప్పు తెగుతుంది..

కృష్ణా: జనసేన సభ చూశాక వైసీపీ నాయకులకు పిచ్చి పట్టిందని ఆ పార్టీ గాదె వెంకటేశ్వరరావు (Gade Venkateshwar rao) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తాడేపల్లి ఆదేశాలతో నోటికొచ్చినట్లు వాగుతున్నారని మండిపడ్డారు. ‘‘సింహాద్రి రమేష్ నువ్వు కూడా మా నాయకుడి గురించి మాట్లాడతావా. అప్పులు ఎగ్గొట్టేందుకు హత్యలు చేయించిన చరిత్ర నీది. అన్ని వేళ్లు నీ వైపే చూపుతున్నా...‌ చర్యలు లేవు. నీ నాయకుడు బాబాయిని చంపినా పట్టించుకోలేదు. అవనిగడ్డకు అభిమానులు రాకుండా అడ్డకుంది ఎవరు. సీబీఐ విచారణ చేయించి నీ తప్పు లేదని చెప్పే దమ్ముందా. మీ ‌వెధవ తనం నిరూపించుకోచడానికి ఇలాంటి దిక్కుమాలిన చర్యలకు పాల్పడుతున్నారు. వెనుక నుంచి ఫోటోలు తీసి... వాటిని ప్రచారం చేసుకుని పైశాచిక ఆనందం పొందుతున్నారు. అంబటి రాంబాబు ఒక పందిలాగా మాట్లాడుతున్నాడు. నువ్వు జీరో అని నీకు తెలుసు కాబట్టే వాగుతున్నావు. మా నాయకుడి గురించి ఇంకోసారి వాగితే చెప్పు తెగుతుంది’’ అంటూ గాదె వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-10-02T11:19:13+05:30 IST