AP NEWS: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ తమిళి సై

ABN , First Publish Date - 2023-09-02T14:46:44+05:30 IST

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ(Indrakiladri Durgamma)ను శనివారం నాడు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్(Telangana Governor Tamil Si Soundararajan) దర్శించుకున్నారు.

AP NEWS: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ తమిళి సై

విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ(Indrakiladri Durgamma)ను శనివారం నాడు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్(Telangana Governor Tamil Si Soundararajan) దర్శించుకున్నారు. గవర్నర్‌కు దుర్గగుడి ఈవో భ్రమరాంబ, చైర్మన్ కర్నాటి రాంబాబు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మ దర్శనం అనంతరం గవర్నర్‌కు వేద పండితులు అమ్మవారి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. చంద్రయాన్ 3 విజయవంతమైనందుకు సంతోషంగా ఉంది. ఆదిత్య వన్ విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నానని గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ తెలిపారు.

Updated Date - 2023-09-02T14:46:44+05:30 IST