బీజేపీలో మార్పు జరగబోతోంది..: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2023-07-13T15:52:46+05:30 IST

విజయవాడ: భారతీయ జనతా పార్టీలో మార్పు జరగబోతుందని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..

బీజేపీలో మార్పు జరగబోతోంది..: సోము వీర్రాజు

విజయవాడ: భారతీయ జనతా పార్టీలో మార్పు జరగబోతుందని ఏపీ బీజేపీ (AP BJP) మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) అన్నారు. గురువారం ఆయన విజయవాడ (Vijayawada)లో మీడియాతో మాట్లాడుతూ తాను సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR), అక్కినేని నాగేశ్వరరావు (Nageswararao), జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాలు చూస్తానని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందని, కేంద్రం కమిట్‌మెంట్‌గా పనిచేస్తోందని.. ఒక కార్యకర్తగా చెబుతున్నానన్నారు. మన ముందు కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ కూతురుగా పురందేశ్వరి (Purandeshwari) వాటిని అధిగమిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలని సోము వీర్రాజు పిలుపిచ్చారు.

Updated Date - 2023-07-13T15:53:28+05:30 IST