Buddha Venkanna: దేశంలో ఎక్కడా లేని రెండు చట్టాలు ఏపీలో అమలవుతున్నాయి

ABN , First Publish Date - 2023-10-08T11:50:43+05:30 IST

విజయవాడ: వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని రెండు చట్టాలు ఎపీలో మాత్రమే అమలవుతున్నాయని అన్నారు.

Buddha Venkanna: దేశంలో ఎక్కడా లేని రెండు చట్టాలు ఏపీలో అమలవుతున్నాయి

విజయవాడ: వైసీపీ నేతల(YCP Leaders)పై టీడీపీ సీనియర్ నేత (TDP Senior Leader) బుద్దా వెంకన్న (Buddha Venkanna) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని రెండు చట్టాలు ఎపీలో మాత్రమే అమలవుతున్నాయని అన్నారు. విశ్వాసం లేని కుక్క కొడాలి నానీ (Kodali Nani).. చంద్రబాబు (Chandrababu), అతని కుటుంబ సభ్యులపై ఎన్ని అయినా వాగొచ్చు.. నోరేసుకుని మాట్లాడినా.. వారిపై కేసులు ఉండవు, అరెస్టు చేయరు.. వారి వ్యాఖ్యలను తప్పు బడితే.. తమపై కేసులు పెడతారని మండిపడ్డారు. పేర్ని నాని కేసులు పెడితే.. పోలీసులు నమోదు చేశారని, తాను కొడాలి నాని, వంశీని విమర్శిస్తే.. పేర్ని నానికి ఏంటి నొప్పని ప్రశ్నించారు. ‘పేర్ని నానీ.. నేను నీ గురించి మాట్లాడితే నీ చెవిలో నుంచి రక్తం కారుతుంది.. గుర్తు పెట్టుకో’ అని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) నేరం చేశారు కాబట్టి బెయిల్ పిటీషన్ (Bail Petition) వేశారని.. చంద్రబాబు నేరం చేయలేదు కాబట్టి.. క్వాష్ పిటీషన్ (Quash Petition) వేశారని.. ఆ మాత్రం కూడా తెలియని వారు మంత్రులుగా పని చేశారని బుద్దా వెంకన్న విమర్శించారు. కొడాలి నానీ వ్యాఖ్యలపై ప్రజలు ఛీ కొడుతున్నారని, అయినా నానీకి సిగ్గు రావడలేదన్నారు. వైసీపీ నాయకులు కూడా ఛీ కొడుతున్నారన్నారు. 2004లో హరికృష్ణ పార్టీలో లేరని.. టీడీపీ టిక్కెట్ ఇచ్చి చంద్రబాబు భిక్ష పెట్టారన్నారు. హరికృష్ణ తన ప్రాణం అనే నానీ.. ఆయనతో లేకుండా 2004లో టీడీపీలోకి ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. చంద్రబాబు వెన్నుపోటు దారుడని చెప్పిన నానీ.. ఆయన సంతకంతో ఉన్న బీ ఫాం అప్పుడు ఎందుకు తీసుకున్నావని ప్రశ్నించారు.

కృష్ణాజిల్లాలో వైసీపీ కుక్కలు చెలరేగిపోతున్నాయని, జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని చవట దద్దమ్మలు కూడా రెచ్చిపోతున్నారని బుద్దా వెంకన్న అన్నారు. 2024 ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రాగానే బెజవాడ బెంజిసెంటర్‌లో వాగిన కుక్కలను మోకాళ్ళ మీద నడిపిస్తామన్నారు. అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ స్తంభాలకు ఈ కుక్కలను కట్టేస్తామన్నారు. చంద్రబాబు అవినీతి చేయలేదని.. జగన్ దుర్మార్గంతో జైలుకు పంపారని బుద్దా వెంకన్న అన్నారు.

Updated Date - 2023-10-08T12:05:41+05:30 IST