SomuVeerraju: ఆ మాట చాలా బలమైనది... పొత్తుపై సోమువీర్రాజు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-02-04T14:04:48+05:30 IST

జనసేనతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

SomuVeerraju: ఆ మాట చాలా బలమైనది...  పొత్తుపై సోమువీర్రాజు వ్యాఖ్యలు

అమరావతి: జనసేనతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు (BJP Leader Somuveerraju) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జనంతో పొత్తు.. లేకపోతే జనసేనతో పొత్తు (Alliance with Janasena) అంటూ చేసిన మాటకు వివరణ ఇచ్చారు. ‘‘జనంతో మా పొత్తు అనే మాట చాలా బలమైనది. ఈ వ్యాఖ్య వెనుక ఎంతో అర్ధం ఉంది. జనముతోనే మా పొత్తు.. వస్తే జనసేనతో పొత్తు’’ అంటూ స్పష్టం చేశారు. ప్రజలను రోడ్ల మీద వదిలేసిన పార్టీలతో తమ పొత్తు ఉండదని తెలిపారు. తాము రోడ్లు వేస్తే జగన్ అరగ్గొట్టారని... ఇప్పుడు యువ నాయకుడు ప్రారంభించారని యెద్దేవా చేశారు. జగన్ సర్కార్ (Jagan Government) తప్పిదాలపై ఛార్జ్‌షీట్ (Charge sheet) దాఖలు చేస్తామని తెలిపారు. త్వరలోనే పాదయాత్రలు చేస్తామని ప్రకటించారు. అధికారం, అవినీతి కోసమే ఫోన్ ట్యాపింగ్‌ (Phone Tapping)లు అని.. గతపార్టీ అదే చేసిందని... ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అదే చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ, టీడీపీ (YCP, TDP Parties) లు ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు... ఇవి కుటుంబ పార్టీలన్నారు. జనసేన కుటుంబ పార్టీ కానే కాదన్నారు. రాష్ట్రంలో కేపిటల్ లేకుండా పోవడానికి కుటుంబ పార్టీలే కారణమని సోమువీర్రాజు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-02-04T14:04:49+05:30 IST