YCP : అవనిగడ్డ వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

ABN , First Publish Date - 2023-01-28T14:08:16+05:30 IST

అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.

YCP : అవనిగడ్డ వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ (Avanigadda YCP)లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ బాలశౌరి (MP Balashouri) అనుచరుడిపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు (MLA Simhadri Ramesh Babu) అనుచరులు దాడి చేశారు. 3 నెలల క్రితం జరిగిన సీఎం పర్యటన సందర్భంగా ఎంపీ బాలశౌరి అనుచరులతో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అనుచరులకు మధ్య విభేదాలు చెలరేగాయి. నాగాయలంకలో జరిగిన నాబార్డు చ్చైర్మన్ జోషి పర్యటనలో పాల్గొనేందుకు ఎంపీ బాలశౌరి, అతని అనుచరులు వచ్చారు. సభా అనంతరం బాలశౌరి అనుచరులను చెప్పులతో కొడుతూ ఎమ్మెల్యే అనుచరులు అవమానించారు. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా ఎమ్మెల్యే సింహాద్రి మేనల్లుడు దాడి చేశాడు. అంతేకాకుండా బూతులు తిట్టి ఫోన్ పగులగొట్టాడు. సమావేశం జరిగే సమయంలో మార్కెట్ కమిటీ కార్యాలయంలో కూడా గొడవ జరిగినట్లు సమాచారం. మీడియాపై దురుసు ప్రవర్తనపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2023-01-28T14:08:17+05:30 IST