AP News: కృష్ణా జిల్లాలో కలకలం రేపుతున్న జంట మృతదేహాలు

ABN , First Publish Date - 2023-05-21T18:40:44+05:30 IST

జిల్లాలోని జంట మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. గన్నవరం మండలం సావారగూడెం కొండ మధ్యలో గుర్తు తెలియని మృతదేహాలను గ్రామస్తులు గుర్తించారు.

AP News: కృష్ణా జిల్లాలో కలకలం రేపుతున్న జంట మృతదేహాలు

కృష్ణా: జిల్లాలోని జంట మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. గన్నవరం మండలం సావారగూడెం కొండ మధ్యలో గుర్తు తెలియని మృతదేహాలను గ్రామస్తులు గుర్తించారు. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. మృతదేహాలపై విషయంపై గ్రామస్తులు గన్నవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న గన్నవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయారా? లేక హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతులు సుమారు 70 ఏళ్లు, 30 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2023-05-21T18:40:44+05:30 IST