Kanna Lakshminarayana : ఏపీలో రాక్షస పాలన సాగుతోంది

ABN , First Publish Date - 2023-10-07T11:55:57+05:30 IST

గుంటూరులో ధర్మాగ్రహ శాంతి ర్యాలీకి వెళ్లకుండా నోటీసులు ఇవ్వటం ప్రజాస్వామికమని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిస్థితి లేదన్నారు.

Kanna Lakshminarayana : ఏపీలో రాక్షస పాలన సాగుతోంది

గుంటూరు : గుంటూరులో ధర్మాగ్రహ శాంతి ర్యాలీకి వెళ్లకుండా నోటీసులు ఇవ్వటం ప్రజాస్వామికమని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిస్థితి లేదన్నారు. వైసీపీ గూండాలు దాడి చేసి.. తిరిగి బాధితులపైనే కేసులు పెడుతున్నారన్నారు. ఏపీలో రాక్షస పాలన సాగుతోందన్నారు. 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన జగన్.. విపక్ష నాయకుల పైనా కేసులు పెట్టి జైల్లో వేయాలని చూస్తున్నారన్నారు.

పోలీసుల అండతో విపక్షాలను వేధిస్తున్నారన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు అరాచక శక్తులకు అండగా ఉంటున్నారని కన్నా పేర్కొన్నారు. శాంతి ర్యాలీకి అనుమతి కోరినా ఇవ్వలేదన్నారు. బ్రిటీష్ పాలనను మించిన అరాచక పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి ఉందన్నారు. పోలీస్ వ్యవస్థ మొత్తం జగన్ అరాచకాలకు కాపలా కాస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లలు అదృశ్యం అవుతున్నా పట్టించుకునే పరిస్థితి పోలీసులకు లేదని కన్నా లేదన్నారు.

Updated Date - 2023-10-07T11:55:57+05:30 IST