PawanKalyan: ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై పవన్ ఫోకస్
ABN , First Publish Date - 2023-12-01T10:28:41+05:30 IST
Andhrapradesh: ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఈరోజు(శుక్రవారం) పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళగిరి పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది.
అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ఫోకస్ పెట్టారు. ఈరోజు(శుక్రవారం) పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళగిరి పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. జనసేన, టీడీపీ క్షేత్ర స్థాయిలో సమన్వయంతో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్ల జాబితాలు పరిశీలన తదితర విషయాలపై జనసేనాని దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశానికి పార్టీ పీఏసీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా, నగర అధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యులు, అనుబంధ విభాగాల ఛైర్మన్లు హాజరుకానున్నారు.