Pawan Kalyan: తెలంగాణ కీర్తి అజరామరం

ABN , First Publish Date - 2023-06-02T10:34:32+05:30 IST

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వాసులందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Pawan Kalyan: తెలంగాణ కీర్తి అజరామరం

అమరావతి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వాసులందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasean Chief Pawan Kalyan) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కీర్తి అజరామరం అని కొనియాడారు. ఈరోజు నుంచి 22వ వరకు సాగే ఈ దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకమైనవన్నారు. ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని.. అటువంటి త్యాగధనులందరికీ నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. పేదరికం లేని తెలంగాణా ఆవిష్కృతం కావాలని.. రైతులు, కర్షకులు, కార్మికులతో పాటు ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం సాగించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-02T10:34:32+05:30 IST