Heavy Rains: మధ్య కోస్తాలో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2023-04-23T21:33:32+05:30 IST

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక (Telangana Karnataka) మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలులు

Heavy Rains: మధ్య కోస్తాలో భారీ వర్షాలు

విశాఖపట్నం: దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక (Telangana Karnataka) మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలులు, భూ ఉపరితలంలో ఉన్న పొడిగాలులు సమ్మిళతం కావడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావంతో ఆదివారం ఉదయం నుంచే కోస్తా, రాయలసీమలో క్యుములో నింబస్‌ మేఘాలు ఆవరించడతో పలుచోట్ల మోస్తరుగా, కృష్ణా, గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులు, ఈదరుగాలులతో భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. పాడేరు ఏజెన్సీలోని కొన్ని ప్రాంతాలో వడగళ్లు పడ్డాయి. వర్షాలతోపాటు గంటలకు 50 నుంచి 60 కి.మీ.ల వేగంతో వీచిన ఈదురుగాలులతో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది.

గోదావరి జిల్లాల్లో పొలాల్లో ఉన్న వరి కుప్పలు, ధాన్యం రాశులు తడిసిపోయాయి. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమ (Rayalaseema)లో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో బలమైనగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆదివారం దేశంలోనే అత్యధికంగా నంద్యాలలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - 2023-04-23T21:33:32+05:30 IST