AP NEWS: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష

ABN , First Publish Date - 2023-08-29T19:02:36+05:30 IST

పోలవరం ప్రాజెక్టు( Polavaram Project)పై కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష నిర్వహిచింది. ప్రాజెక్టు పనుల పురోగతిపై సీడబ్య్లూసీ అధికారులతో జల శక్తి శాఖ కార్యదర్శి భేటీ అయ్యారు.

AP NEWS: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష

అమరావతి; పోలవరం ప్రాజెక్టు( Polavaram Project)పై కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష నిర్వహిచింది. ప్రాజెక్టు పనుల పురోగతిపై సీడబ్య్లూసీ అధికారులతో జల శక్తి శాఖ కార్యదర్శి భేటీ అయ్యారు. ప్రతి నెలా జాతీయ ప్రాజెక్టులపై జరిపే సమీక్షలో భాగంగానే ఈరోజు కూడా అధికారులతో జలశక్తి శాఖ కార్యదర్శి సమీక్ష(Review by the Secretary of Hydropower Department) జరుపుతున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.పోలవరంలో డయాఫ్రమ్ వాల్, అప్పర్, లోయర్ కాపర్ డ్యాంల పరిస్థితి, రెండు చోట్ల నుంచి నీటి లీకేజీ, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రదేశంలో చేపట్టాల్సిన చర్యలు, ఇప్పటికే జలశక్తి శాఖ నుంచి ఇచ్చిన ఆదేశాల అమలు తీరుతెన్నులపై కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈరోజు జలశక్తి శాఖ నిర్వహించే సమావేశానికి తొలుత రాష్ట్ర అధికారులను కూడా పిలవాలని అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో వద్దనుకున్నట్లు సమాచారం మంత్రిత్వ శాఖలో చర్చించిన తర్వాతనే రాష్ట్ర అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు పోలవరంలో చేపట్టిన పనులు తలెత్తిన ఇబ్బందులు ప్రాజెక్టు ప్రాంతంలో తాజా పరిస్థితి సీడబ్య్లూసీ ఇతర కేంద్ర సంస్థలు ఇచ్చిన నివేదికలన్నింటిపై ఈ సమావేశంలో జల శక్తి శాఖ కార్యదర్శి కూలంకషంగా చర్చించారు.

Updated Date - 2023-08-29T19:02:36+05:30 IST