Paiyavula keshav: అవినాష్‌రెడ్డి ఏమైనా అంతరిక్షంలో నుంచి దిగొచ్చారా?

ABN , First Publish Date - 2023-01-28T20:20:43+05:30 IST

ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి(Avinash Reddy ) ఏమైనా అంతరిక్షంలో నుంచి దిగొచ్చారా? ఆంధ్రప్రదేశ్ పౌరుడు కాదా? అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్(Paiyavula keshav ) ప్రశ్నించారు.

Paiyavula keshav: అవినాష్‌రెడ్డి ఏమైనా అంతరిక్షంలో నుంచి దిగొచ్చారా?

అమరావతి: ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి(Avinash Reddy ) ఏమైనా అంతరిక్షంలో నుంచి దిగొచ్చారా? ఆంధ్రప్రదేశ్ పౌరుడు కాదా? అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్(Paiyavula keshav ) ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారించేటపుడు వీడియోగ్రఫీ చిత్రీకరించాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి (Srikanth Reddy) అనడం సిగ్గుచేటన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు వైసీపీ నేతలకు ఈ విషయం గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. ‘‘ఇప్పుడు మీ పార్టీ నేతలకు వచ్చే సరికి ఆ నొప్పి తెలిసిందా? ఏపీ పోలీసులకు ఒక రూల్ సీబీఐకి ఒక రూలా? ఎంపీ రఘరామకృష్ణరాజు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, అయ్యన్నపాత్రుడు, చింతమనేని ప్రభాకర్, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలను అరెస్టు చేసి వేధింపులకు గురి చేసినపుడు మీకు చట్టం గుర్తుకు రాలేదా? మీ పార్టీ వారికి ఒక న్యాయం, ఇతర పార్టీలకు మరో న్యాయమా’’? అని నిలదీశారు. సొంత బాబాయి హత్య కేసులో అవినాష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. అందరిలాగే అతన్ని విచారిస్తారు తప్ప ఆయనకు ప్రత్యేక విచారణ ఏమీ ఉండదని పయ్యావుల కేశవ్ అన్నారు.

Updated Date - 2023-01-28T20:20:44+05:30 IST