Share News

Bapatla Dist.: కొరిశపాడులో కరోనా కలకలం..

ABN , Publish Date - Dec 31 , 2023 | 01:00 PM

బాపట్ల జిల్లా: కొరిశపాడులో కరోనా కలకలం రేపింది. గత వారం కొరిశపాడు గ్రామం నుంచి శబరిమల యాత్రకు వెళ్లి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. వారితో పాటు మరో 30 మంది గ్రామస్తులు ఒకే బస్సులో ప్రయాణించారు.

Bapatla Dist.: కొరిశపాడులో కరోనా కలకలం..

బాపట్ల జిల్లా: కొరిశపాడులో కరోనా కలకలం రేపింది. గత వారం కొరిశపాడు గ్రామం నుంచి శబరిమల యాత్రకు వెళ్లి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. వారితో పాటు మరో 30 మంది గ్రామస్తులు ఒకే బస్సులో ప్రయాణించారు. దీంతో కోవిడ్ కేసులు మరిన్ని పెరిగే అవకశం ఉందని వైద్య సిబ్బంది తెలిపారు. పాజిటీవ్ వచ్చినవారిని చికిత్స అందిస్తున్నారు. మిగతావారి శాంపిల్స్ సేకరించి ఒంగోలు రిమ్స్‌కు పంపించారు. ఆరుగురికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురౌతున్నారు.

కాగా దేశంలో(India) కరోనా కేసుల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 841 కోవిడ్ 19 కేసులు(covid 19 cases) నమోదయ్యాయి. అయితే ఇవి గత 227 రోజుల్లోనే అత్యధిక కేసులు కావడం విశేషం. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,309కి పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో కేరళ, కర్ణాటక, బీహార్‌లలో ఒక్కొక్కటి చొప్పున మూడు మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

గత 10 రోజుల కరోనా కేసుల సమాచారాన్ని పరిశీలిస్తే రోజుకు సగటున 500 నుంచి 600 కొత్త కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఈ క్రమంలో రోజురోజుకు కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరించారు. ప్రస్తుత ఇన్‌ఫెక్షన్ కేసులకు ప్రధాన కారణం కరోనా కొత్త వేరియంట్ JN.1 అని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇటివల కరోనా సోకిన వారిలో చాలా మంది సులభంగా కోలుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు అన్నారు. దీంతోపాటు అనేక మందికి తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లిన సమయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.

Updated Date - Dec 31 , 2023 | 01:00 PM