AP News: తాడేపల్లిలో దౌర్జన్యం.. పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి..

ABN , First Publish Date - 2023-03-26T10:22:08+05:30 IST

గుంటూరు జిల్లా: తాడేపల్లి (Tadepalli)లో దౌర్జన్యం ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి పెట్రోల్ బంక్‌ (Petrol Bunk)లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి జరిగింది.

AP News: తాడేపల్లిలో దౌర్జన్యం.. పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి..

గుంటూరు జిల్లా: తాడేపల్లి (Tadepalli)లో దౌర్జన్యం ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి పెట్రోల్ బంక్‌ (Petrol Bunk)లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి జరిగింది. ఓ వాహనదారుడు పెట్రోల్ పోయించుకున్నాడు. ఫోన్ పే పని చేయకపోవడంతో నగదు ఇవ్వాలని బంక్ సిబ్బంది అడగారు. దీంతో రెచ్చిపోయిన వాహనదారుడు పెట్రోల్ పోసిన వ్యక్తిని ఎగిరెగిరి తన్నాడు. తీవ్ర గాయాలతో పెట్రోల్ బంక్ నిర్వాహకుడు కుప్పకూలిపోయాడు. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసి.. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా తాడేపల్లి ప్రాంతలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న గొడ్డలితో పెనుమాకలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. సీఎం నివాస ప్రాంతంలో నిత్యం ఏదో ఒక ఘటన జరుగుతోంది.

Updated Date - 2023-03-26T10:22:08+05:30 IST