Share News

Kollu Ravindra: సిగ్గులేకుండా ఇంకా మంగళవారం కబుర్లు ఎందుకు?

ABN , First Publish Date - 2023-10-18T10:30:52+05:30 IST

ఎంపీ మోపిదేవి వెంకటరమణపై మాజీ మంత్రి కొల్లురవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Kollu Ravindra: సిగ్గులేకుండా ఇంకా మంగళవారం కబుర్లు ఎందుకు?

అమరావతి: ఎంపీ మోపిదేవి వెంకటరమణపై (MP Mopidevi Venkataramana) మాజీ మంత్రి కొల్లురవీంద్ర (Former minister Kollu Ravindra) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌తో (CM Jagan) కలిసి జైలు కూడు తిన్న ఎంపీ మోపిదేవి.. చంద్రబాబుపై (TDP Chief Chandrababu Naidu) విమర్శలు సిగ్గుచేటని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జైలు కూడు తినడానికి అలవాటుపడ్డ వైసీపీ నేతలకు (YCP Leaders) ప్రజల చేత తిట్లు తిన్నా సిగ్గు రావడం లేదన్నారు. చంద్రబాబు 6 లక్షల కోట్ల అవినీతి చేసాడన్నారుగా నాలుగున్నరేళ్ల నుంచి ఏం పీకారని ప్రశ్నించారు. అరెస్ట్ చేసి 40 రోజులైనా ఒక్క ఆధారం సేకరించలేకపోయారని.. సిగ్గులేకుండా ఇంకా మంగళవారం కబుర్లు ఎందుకంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబుపై కేసు పెట్టి కక్ష తీర్చుకున్నాడే తప్ప.. రూపాయి అవినీతి నిరూపించలేకపోయారన్నారు. ‘‘మోపిదేవి నీ అవినీతి కేసుల పార్టనర్ జగన్ రెడ్డి రూ.43 వేల కోట్ల ప్రజల సొమ్ము దొబ్బి తిన్నాడని సీబీఐ, ఈడీ చార్జిషీట్లు వేశాయి. పదేళ్ల నుంచి బెయిల్‌పై ఉన్న నీ అవినీతి పార్టనర్ బెయిల్ రద్దు ఐతే మీ పరిస్తితి ఏంటో ఆలోచించుకో’’ అంటూ కల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

Updated Date - 2023-10-18T10:30:52+05:30 IST