Share News

India vs Australia: విశాఖలో భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్

ABN , First Publish Date - 2023-11-23T18:24:25+05:30 IST

విశాఖ వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ రోజు సాయంత్రం 7 గంటలకు తొలి 20 మ్యాచ్ జరగనుంది. భారత్ - ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. స్టేడియానికి ఇరు జట్లు చేరుకున్నాయి. భారత క్రికెటర్లను చూసి అభిమానులు కేరింతలు కొడుతున్నారు

India vs Australia: విశాఖలో భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్

విశాఖపట్నం: విశాఖ వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ రోజు సాయంత్రం 7 గంటలకు తొలి 20 మ్యాచ్ జరగనుంది. భారత్ - ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. స్టేడియానికి ఇరు జట్లు చేరుకున్నాయి. భారత క్రికెటర్లను చూసి అభిమానులు కేరింతలు కొడుతున్నారు. స్టేడియానికి క్రీడా అభిమానులు చేరుకుంటున్నారు. స్టేడియం చూట్టూ కట్టుదట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. టికెట్లను పరిశీలించిన తర్వాత స్టేడియం లోపలికి అనుమతిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వస్తువులు, జెండా కర్రలను నిషేధించినట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2023-11-23T18:25:20+05:30 IST