AP News: అమలాపురంలో వైసీపీ రంగులతో శకటాలు ప్రదర్శన.. మండిపడ్డ విపక్ష నేతలు

ABN , First Publish Date - 2023-08-15T15:11:44+05:30 IST

పరేడ్ గ్రౌండ్‌లో రాజకీయ నాయకుల కటౌట్ ఏర్పాటుపై గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. అలాగే శకటాలకు జాతీయ రంగుల బెలూన్స్ కాకుండా కొన్ని శకటాలకు వైసీపీ రంగుల బెలూన్స్ కట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగుల బెలూన్స్‌తో డెకరేషన్ చేసిన శకటాల ప్రదర్శించారు.

AP News: అమలాపురంలో వైసీపీ రంగులతో శకటాలు ప్రదర్శన.. మండిపడ్డ విపక్ష నేతలు

అమలాపురం: అమలాపురం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో 77వ స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. పరేడ్ గ్రౌండ్‌లో రాజకీయ నాయకుల కటౌట్ ఏర్పాటుపై గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. అలాగే శకటాలకు జాతీయ రంగుల బెలూన్స్ కాకుండా కొన్ని శకటాలకు వైసీపీ రంగుల బెలూన్స్ కట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగుల బెలూన్స్‌తో డెకరేషన్ చేసిన శకటాల ప్రదర్శించారు. అధికారులు ఇలా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు తేడా లేకుండా ఉందని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుల మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ అధికారులపై పలువురు నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడంపై కోర్టు ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేదంటూ నాయకులు ఫైరయ్యారు.

Updated Date - 2023-08-15T15:11:44+05:30 IST