Rajahmundry: నారా భువనేశ్వరిని కలిసిన కన్నా..

ABN , First Publish Date - 2023-10-03T16:10:15+05:30 IST

రాజమండ్రి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం రాజమండ్రిలో కలిశారు.

Rajahmundry: నారా భువనేశ్వరిని కలిసిన కన్నా..

రాజమండ్రి: తెలుగుదేశం అధినేత (TDP Chief) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari)ని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) మంగళవారం రాజమండ్రిలో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రాక్షసుడిని పంపించాలని బాబుతో జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కలిశారని అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టే పరిస్థితి వచ్చిందని... శాంతి భద్రతలు లేవని.. పూర్తిగా క్షీణించిపోయాయని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించాలని కోరారు.

రాష్ట్రంలో సీఐడీ (CID) సీఎం జగన్ (CM Jagan) జేబు సంస్థలా మారిపోయిందని జైలులో హింస పెట్టి ఆ వీడియోలు చూసి పైశాచిక ఆనందం పొందే వ్యక్తి సీఎం జగన్ అని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఓ ప్రణాళిక ప్రకారం ప్రతిపక్ష నేతలను బెయిల్ మీద ఉండేలా చేస్తున్నారని, జగన్ ఆర్ధిక నేరస్థుడిగా 16 నెలలు జైలులో ఉన్నారని ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-03T16:10:15+05:30 IST