Share News

AP NEWS: రాజమండ్రిలో గోదావరిలోకి దూకి యువకుడు గల్లంతు

ABN , First Publish Date - 2023-11-24T16:33:19+05:30 IST

రాజమండ్రి ( Rajahmundry ) బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి యువకుడు గల్లంతయ్యాడు. ఏపీలోని ఏలేశ్వరానికి చెందిన శెట్టి వినోద్ కుమార్‌ అనే యువకుడు శుక్రవారం ద్విచక్రవాహనంపై రాజమండ్రి బ్రిడ్జి వద్దకు చేరుకుని, బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకాడు.

AP NEWS: రాజమండ్రిలో గోదావరిలోకి దూకి యువకుడు  గల్లంతు

రాజమండ్రి: రాజమండ్రి ( Rajahmundry ) బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి యువకుడు గల్లంతయ్యాడు. ఏపీలోని ఏలేశ్వరానికి చెందిన శెట్టి వినోద్ కుమార్‌ అనే యువకుడు శుక్రవారం ద్విచక్రవాహనంపై రాజమండ్రి బ్రిడ్జి వద్దకు చేరుకుని, బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు శెట్టి వినోద్ కుమార్‌ ఆచూకీ జాడలేదు. యువకుడు ఆత్మహత్యా యత్నానికి ఎందుకు ఒడగట్టాడో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా బైక్ లో యువకుడి ఆధార్ కార్డు లభించాయి. పోలీసులు యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Updated Date - 2023-11-24T16:55:32+05:30 IST